గిట్టుబాటు ధర కల్పించాలంటూ వేలం బహిష్కరించిన పొగాకు రైతులు

వేలం కేంద్రం వద్ద నిరసన

పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతులు వేలాన్ని బహిష్కరించి వేలం కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రైతు నాయకులు సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ కాన్సర్ కారక పొగాకు ఉత్పత్తులకు సహాయం అందించలేమని కేంద్రప్రభుత్వం తెలిపిందని…..

ఐటీసీ కంపెనీ మినహా మిగిలిన అన్ని కంపెనీలు పొగాకు వేలంలో పాల్గొనేటట్లు చేయకపోవడం వలన రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని….. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ అవులూరి కోటేశ్వరరావు వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.