పట్టణంలో నేడు మరో రెండు కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు

వివరాల్లోకి వెళితే స్థానిక విశ్వనాథపురంలో నివాసం ఉంటూ వ్యాపారం నిర్వహిస్తున్న ఓ కుటుంబంలో ఇద్దరికి మంగళవారంనాడు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
పట్టణంలో పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా కఠిన ఆంక్షలతో లాక్ డౌన్ నిర్వహిస్తున్నారు. అయినా మంగళవారంనాడు కూడా ఒకే కుటుంబంలో ఇద్దరికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను కనుగొనే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.