ప్రశాంతంగా ముగిసిన గ్రామ సచివాలయ పరీక్షలు

గ్రామ సచివాలయం సిబ్బంది నియామకాలకు సంబంధించి ఆదివారంనాడు నిర్వహించిన వ్రాత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.

వివరాల్లోకి వెళితే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయం పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆదివారంనాడు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా అందులో భాగంగా పొదిలి మండలంలో మొత్తం 11పరీక్ష కేంద్రాల్లో రెండు పూటలా పరీక్షలు నిర్వహించారు. ఉదయం పూట 2288మందికి గాను 1785మంది హాజరు కాగా 553 మంది గైర్హాజరయ్యారు.

మధ్యాహ్నం 2288మందికి గాను 1636మంది హాజరయ్యారు కాగా 652 మంది గైర్హాజరు అయినట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ తెలిపారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్దయెత్తున పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.

పరీక్ష కేంద్రాలను దర్శి డియస్పీ ప్రకాశరావు, సిఐ శ్రీరామ్, యస్ఐ సురేష్ లు ఎప్పటికప్పుడు సందర్శిస్తూ పరీక్షలు ప్రశాంతంగా ముగిసేందుకు కృషి చేశారు.