50కంచాలు పంపిణీ చేసిన విశ్రాంత ఉపాధ్యాయుడు

విశ్రాంత ఉపాధ్యాయుడు 50కంచాలు పంపిణీ చేసిన కార్యక్రమం బుధవారంనాడు నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే స్థానిక తహశీల్దార్ కార్యాలయం ప్రక్కన ఉన్న జిల్లా పరిషత్ పాఠశాల నందు విశ్రాంత ఉపాధ్యాయుడు
మోహన కృష్ణ సతీమణి సరస్వతి చేతుల మీదాగా పాఠశాల్లోని 50మంది విద్యార్థులకు కంచాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పద్మావతి ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.