పౌరసరఫరాల శాఖ అధికారుల తనిఖీలు…. 60గ్యాస్ సిలిండర్ల జప్తు

మండల పరిధిలోని ఏలూరు గ్రామంలో పౌరసరఫరాల అధికారులు తనిఖీలు నిర్వహించి అక్రమంగా నిల్వఉంచిన 60వంట గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు.

వివరాల్లోకి వెళితే ఏలూరు గ్రామంలో గురువారం రాత్రి పౌరసరఫరాల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా అక్రమంగా నిల్వఉంచిన హెచ్ పి, భారత్, ఇండెన్ కంపెనీలకు చెందిన గృహ వాడుకకు ఉపయోగించే 32చిన్న సిలెండర్లను, వ్యాపార సంస్థలు ఉపయోగించే 28పెద్ద సిలెండర్లను గుర్తించి…… సిలెండర్లను సీజ్ చేసి పొదిలి కరుణా ఇండెన్ గ్యాస్ గుడౌన్ కు తరలించారు.

నిల్వఉంచిన వ్యక్తులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.