20 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డ యస్ఇబి సిఐ, కానిస్టేబుల్

కల్లు గీత వారి నుంచి 20 వేలు రూపాయలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు యస్ఇబి సిఐ , కానిస్టేబుల్ పట్టుబడిన సంఘటనా శనివారం నాడు చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే కొనకనమీట్ల గ్రామ నందు ప్రభుత్వ అనుమతి కలిగిన కల్లు అమ్మకం దుకాణం నిర్వాహకుల నుంచి నెలవారీ లంచం ఇవ్వాలని ఒత్తిడి చెయ్యడంపై ఫిర్యాదు రావటంతో ఒంగోలు ఎసిబి డిఎస్పీ సూర్య’ నారాయణరెడ్డి వారి సిబ్బంది తో పొదిలి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ నందు వల వేసి యస్ఇబి సిఐ వెంకట్రావు, కానిస్టేబుల్ షంషీర్, లను అరెస్టు చేయగా మరో కానిస్టేబుల్ నాయక్ పై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు

విరిని ఎసిబి కోర్టు నందు హాజరపరచనట్లు ఎసిబి డిఎస్పీ సూర్య నారాయణరెడ్డి తెలిపారు.