త్వరలో యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు ఎంపిక రాష్ట్ర అధ్యక్షులు : మాలకొండయ్య యాదవ్

అఖిల భారత యాదవ మహాసభ ప్రకాశంజిల్లా అధ్యక్షులుని త్వరలో ఎంపిక చేస్తామని రాష్ట్ర అధ్యక్షులు పట్టెబోయిన మాలకొండయ్య యాదవ్ అన్నారు.

వివరాల్లోకి వెళితే అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో పొదిలి నందు ఏర్పాటు చేసిన కార్తీక వనమహోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రస్తుతం జిల్లా ప్రకాశంజిల్లాకు అధ్యక్షులు లేకపోవడం వలన కార్యక్రమాల నిర్వహణలో కొంత ఇబ్బందులు ఉన్నాయని కాబట్టి త్వరలోనే జిల్లా అధ్యక్షులతో పాటు పూర్తిస్థాయి జిల్లా కార్యవర్గం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.