మేడే సందర్భంగా కార్మికులకు అన్నదానం

ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే శనివారం నాడు స్థానిక పొదిలి నగర పంచాయితీ కార్యాలయం వద్ద ఎంబిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చెట్లూరి బాదుల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని నగర పంచాయితీ కమీషనర్ భవాని ప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు.
తొలుత ప్రత్యేకం ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి కార్మికులకు పంచిపెట్టారు.

ఈ సందర్భంగా కార్యక్రమంలో పొదిలి నగర పంచాయితీ శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు, ఎంబిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చెట్లూరి బాదుల్లా, వైకాపా నాయకులు వెంకటరెడ్డి సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి ఎం రమేష్ మరియు నగర పంచాయితీ సిబ్బంది మరియు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.