దివ్యాంగులకు అండగా ఉంటాం : మాగుంట

దివ్యాంగులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనువాసుల రెడ్డి అన్నారు.

సోమవారం స్ధానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో  మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి వైసీపీ విజయోత్సవ సందర్భంగా కేకును కోసి పంచిపెట్టారు. అనంతరం దివ్యాంగులు పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులను ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనువాసులరెడ్డి, మండల పరిషత్ అధ్యక్షులు నరసింహరావు, జడ్పీటిసి సభ్యులు సాయిరాజేశ్వరావు, మండల పార్టీ కన్వీనర్ జి సంజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.