భవిత పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి

భవిత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి బుధవారంనాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

వివరాల్లోకి వెళితే స్థానిక మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని భవిత ప్రత్యేక అవసరాలు గల పిల్లల పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి విఎస్ సుబ్బారావు పిల్లలకు పాఠశాల నందు పాఠశాల రికార్డులను పరిశీలించి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.

అనంతరం నడవలేని విద్యార్థులకు అందిస్తున్న ఫిజియోథెరపీ సేవల ఉపయోగం మరియు పిల్లల అభివృద్ధి గురించి ఆరాతీశారు. అలాగే భవిత పాఠశాల నిర్వహణలో మెరుగైన సేవలను అందించేందుకు కావలసిన సలహాలు సూచనలను తెలిపారు.

ఈ కార్యక్రమంలో భవిత పాఠశాల ఉపాధ్యాయులు కె గోపాలకృష్ణ, ఎస్ కె ఏ సహిత బేగం, కేర్ టేకర్ నారాయణమ్మ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.