శాసనసభ స్ధానం కైవశానికై 25వేల సభ్యత్వం లక్ష్యం… బిజెపి రాష్ట్ర కమిటీ సభ్యులు శాసనాల సరోజిని , బ్రహ్మేశ్వర ప్రసాద్

రానున్న ఎన్నికల్లో మార్కాపురం నియోజకవర్గాన్ని కైవసం చేసుకునే దిశగా 25వేల సభ్యుల నమోదు లక్ష్యంగా పెట్టుకున్నామని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులు నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్చార్జ్ మంచాల బ్రహ్మేశ్వర ప్రసాద్, పొదిలి మండల సభ్యత్వ నమోదు ఇన్చార్జ్ శాసనాల సరోజినీలు తెలిపారు.

వివరాల్లోకి వెళితే స్థానిక రోడ్లు భవనముల అతిథి గృహంలో మంగళవారం వారిని కలిసిన విలేకరులతో వారు మాట్లాడుతూ బిజెపి సభ్యత్వం కోరకు 8984848484 నెంబర్ కు మిస్ కాల్ ఇవ్వడం ద్వారా నమోదు చేసుకోవచ్చునని….. ఈ నెల 6వ తేది నుండి ఆగష్టు 11వ తేది వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని అదేవిధంగా పార్టీలోకి మాజీ ప్రజా ప్రతినిధులు చేరుటకు సిద్ధంగా ఉన్నారని….. మరికొంత మందిని పార్టీలో చేరేందుకు ఆహ్వానిస్తామని సభ్యత్వ నమోదులో యువత పెద్ద ఎత్తున చేరుతున్నారని వారు అన్నారు.