గవర్నర్ చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్న పొదిలి విద్యార్థిని

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా పొదిలి పట్టణానికి చెందిన బొరిగోర్ల వెంకట సాయి గీతాంజలి బంగార పథకం అందుకున్నారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నందు 2022-24 విద్య సంవత్సరంలో సోషియాలజీ విభాగంలో విశ్వవిద్యాలయం బంగారు పతకం సాధించింది.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 24వ స్నాతకోత్సవం వేడుకలు గచ్చిబౌలి బ్రహ్మ కుమారీస్ శాంతి సర్వోవర్ లో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఏఐసిటి ఛైర్మన్ ప్రొఫెసర్ టిజీ సీతారాం లు
పొదిలి విద్యార్థిని బొరిగోర్ల వెంకట సాయి గీతాంజలి బంపథకం,ప్రశంస పత్రం, దృవీకరణ పత్రాలు అందజేశారు