మాస్క్ లేకపోతే బస్సులో ప్రయాణం నిషేధం: పొదిలి డిపో మేనేజర్ గిరిబాబు

మాస్క్ లేకపోతే బస్సులో ప్రయాణం నిషేదం విధింస్తున్నట్లు పొదిలి డిపో మేనేజర్ గిరిబాబు తెలిపారు.

వివరాల్లోకి వెళితే దేశవ్యాప్తంగా కరోనా పెద్ద ఎత్తున పెరగటం వల్ల కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించేందుకు బుధవారం నాడు స్థానిక ఆర్టీసీ డిపో నందు డిపో మేనేజర్ గిరిబాబు ప్రయాణికులకు అవగాహన కల్పిస్తూ మాస్క్ లేకపోతే బస్సులో ప్రయాణం నిలిపివేస్తూ మాస్క్ ధరించిన వారికే బస్సు లో ప్రయాణం కల్పించారు.

ఈ కార్యక్రమంలో పొదిలి డిపో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు