ప్రెస్ మీట్ విభాగాన్ని ప్రారంభించిన సిఐ శ్రీరామ్

ఆంధ్రప్రదేశ్ విలేకరుల సంఘం కార్యాలయంలోని ప్రెస్ మీట్ విభాగాన్ని పొదిలి సిఐ శ్రీరామ్ ప్రారంభించారు.

వివరాల్లోకి వెళితే శనివారంనాడు స్థానిక విశ్వనాథపురంలో ఆంధ్రప్రదేశ్ విలేకరుల సంఘం నూతన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కార్యాలయంలోని ప్రెస్ మీట్ విభాగాన్ని సిఐ శ్రీరాం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ప్రభాకరరావు , వైకాపా నాయకులు జి శ్రీనివాసులు, కల్లం సుబ్బారెడ్డి, తెదేపా నాయకులు సయ్యద్ ఇమాంసా మరియు ఆంధ్రప్రదేశ్ విలేకరుల యూనియన్ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.