కోవిడ్ టీకా అవగాహన ర్యాలీ

ప్రజల్లో కోవిడ్ వ్యాక్సిన్ పై అవగాహన కల్పించేందుకు కోవిడ్ టీకా అవగాహన ర్యాలీ నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే గురువారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పొదిలి నాల్గవ సచివాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనువాసులరెడ్డి, ప్రభుత్వ వైద్య అధికారిణి షేక్ షాహీదా , మండల రెవెన్యూ తహశీల్దారు హనుమంతరావు, నగర పంచాయతీ కమిషనర్ భవాని ప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు, ఆరోగ్య శాఖ సూపర్వైజర్ శ్రీనివాసులురెడ్డి, వైకాపా నాయకులు సానికొమ్ము శ్రీనువాసులరెడ్డి, జి శ్రీనివాసులు, కల్లం వెంకట సుబ్బారెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, మరియు సచివాలయల సిబ్బంది, ఎయన్ఎం , ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు