ఆరోగ్యశ్రీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉడుముల……

డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉడుముల అశోక్ రెడ్డిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ సచివాలయం నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

వివరాల్లోకి వెళితే….. మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసరెడ్డి కుమారుడైన ఉడుముల డాక్టర్ అశోక్ రెడ్డి హైదరాబాదులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ కేర్ ట్రస్ట్ నందు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా డాక్టర్ ఉడుముల అశోక్ రెడ్డిని నియమిస్తూ శుక్రవారంనాడు ఉత్తర్వులు జారీచేశారు.