ఉపాధిహామీ క్షేత్ర సహాయకుని కుటుంబానికి ఆర్ధిక సహాయం

మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పొదిలి మండలం ఆముదాలపల్లి గ్రామ పంచాయతీ క్షేత్ర సహాయకులు ఎరుకలయ్య రోడ్డు ప్రమాదంలో మరణించగా…… అతని భార్య చంద్రికకు మట్టి ఖర్చులు నిమిత్తం 15వేల రూపాయల నగదును మార్కాపురం క్లస్టర్ సహాయ సంచాలకులు మధుసూదన్ రెడ్డి, మండల పరషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఏపీవో బుల్లెనరావు, ఈసీ మురళి కృష్ణా తదితరులు పాల్గొన్నారు.