ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలలో ఆకస్మిక తనిఖీలు……

ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో మార్కాపురం నియోజకవర్గ నవరత్నాల అమలు ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే పొదిలి, కొనకనమిట్ల, తర్లుపాడు, మార్కాపురం మండలాల ప్రభుత్వ అధికారులతో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ పథకాల పురోగతిపై సమీక్షా సమావేశం అనంతరం ఆయన ప్రభుత్వ బిసి బాలికల వసతిగృహం మరియు బిసి బాలుర వసతి గృహాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనంతరం రికార్డులను పరిశీలించి…. పిల్లలతో కాసేపు ముచ్చటించారు.

ఈ సందర్భంగా భోజనం నాణ్యతను పరిశీలించిన అనంతరం వార్డెన్లతో ఆయన మాట్లాడుతూ వసతి గృహాలలో ఎల్లప్పుడూ నాణ్యమైన భోజనం అందేలా చూడాలని అలాగే మెనూకు సంబంధించిన బోర్డులను ఏర్పాటు చేయాలని….. పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ, మండల విద్యాశాఖాధికారి రఘురామయ్య, ఈఓఆర్డి రాజశేఖర్, పంచాయతీ సెక్రటరీ రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.