హైకోర్టులో ‌రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురు ఎన్నికల అధికారిగా రమేష్ కుమార్ నియమించాలని హైకోర్టు ఆదేశం

రాష్ట్ర ఎన్నికల కమీషన్ ప్రధానాధికారిగా రమేష్ కుమార్ కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

వివరాల్లోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమీషన్ పదవి కాలం కుదిస్తూ మరియు నూతన ఎన్నికల కమీషన్ ప్రధానాధికారిగా కనగరాజును నియమిస్తూ తీసుకుని వచ్చిన ఆర్డినెన్సును శుక్రవారంనాడు హైకోర్టు ధర్మాసనం కొట్టివేస్తూ…… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టికల్ 213ను ప్రస్తుత పరిస్థితుల్లో సవరించే అధికారం లేదని హైకోర్టు సృష్టం చేసింది.

తక్షణమే రాష్ట్ర ఎన్నికల కమీషన్ ప్రధానాధికారిగా రమేష్ కుమార్ ను కొనసాగుతారని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.