వైభవంగా కార్తీక దీపోత్సవం

కార్తీక పౌర్ణమి సందర్భంగా స్థానిక పొదిలి శివాలయం నందు సాయంత్రం ఏర్పాటు చేసిన కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో వేలాదిగా భక్తులు తరలి వచ్చి భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించి పార్వతీ సమేత నిర్మమహేశ్వరస్వామివారిని దర్శించికొన్నారు. ఈ సందర్భంగా భక్తులు పొదిలిటైమ్స్ తో మాట్లాడుతూ కార్తీక దీపోత్సవం కార్యక్రమం బాగుందిని ఏర్పాట్లు కూడా బాగా చేసారని దర్శనం చేసుకోవడంలో ఎక్కువ సమయంలో పట్టిందాని చాలా సంతోషంగా పండుగను చేసుకుంటున్నామని అన్నారు