అక్రమ ఇసుకను తరలిస్తున్నా లారీ స్వాధీనం

అక్రమంగా ఇసుకను తరలిస్తున్నా లారీని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళితే మంగళవారం నాడు స్థానిక కొనకనమీట్ల మండలం చినారికట్ల జంక్షన్ వద్ద సాధారణ తనిఖీలో భాగం ఎలాంటి అనుమతులు లేకుండా లారీ లో అక్రమంగా తరలిస్తున్న 42 టన్నుల ఇసుకను గుర్తించిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు లారీని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు యస్ఇబి అధికారులు తెలిపారు.

ఈ తనిఖీల్లో జిల్లా యస్ఇబి ఎఈయస్ దుర్గాప్రసాద్, పొదిలి యస్ఇబి స్టేషన్ యస్ఐ శ్రీధర్ బాబు, హెడ్ కానిస్టేబుల్ కె వెంకట్రావు, కానిస్టేబులు షేక్ బాజీ సయ్యద్, పి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు