ఉపాధి హామీ పథకం అమలు తీరును సమీక్షించిన శాసనసభ్యులు కుందూరు

జాతీయ ఉపాధి హామీ పథకం అమలు జరుగుతున్న తీరుపై మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే బుధవారంనాడు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన పొదిలి, కొనకనమిట్ల మండలాలకు సంబంధించిన ఉపాధిహామీ పథకం అమలు జరుగుతున్న తీరుపై జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న పనుల స్థితిని సమీక్షించి అనంతరం ప్రజలు దరఖాస్తు చేసుకున్న వెంటనే జాబ్ కార్డు ఖచ్చితంగా ఇవ్వాలని….. పనుల్లో వివక్షత లేకుండా అందిరికీ ఉపాధి దొరికే విధంగా కృషి చేయాలని లేకపోతే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో పొదిలి ఎంపిడిఓ శ్రీకృష్ణ. పొదిలి, కొనకనమిట్ల ఎపిఓలు మరియు ఉపాధి హామీ పథకం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.