మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ మరియు ఎన్ సి పి మధ్య పొత్తు ఖరారు…. 125సీట్లు పోటీ 38సీట్లు ఇతర చిన్న పార్టీలతో కూడా పొత్తు

భారత జాతీయ కాంగ్రెసు పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల మధ్య జరగన్న మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పొత్తు ఖరారు అయినట్లు నేషనలిస్ట్ కాంగ్రెసు పార్టీ అధినేత శరత్ పవార్ సోమవారం తెలిపారు.

మొత్తం 288 శాసనసభ స్థానాలు కలిగిన మహారాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ పార్టీ, నేషనలిష్ట్ కాంగ్రెస్ పార్టీ చేరి 125 సీట్లు పోటీ చేసేందుకు పొత్తు ఖరారు కాగా మరో 38సీట్లలో ఇతర చిన్న పార్టీలతో పొత్తు పొత్తుకోసం వదిలిపెట్టినట్లు శరత్ పవార్ తెలిపారు.