సిఐటియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు

సిఐటియు ఆధ్వర్యంలో ప్రపంచ కార్మికుల దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో స్థానిక పొదిలి నగర పంచాయితీ కార్యాలయం , పౌరసరఫరాల శాఖ గిడ్డంగి, వాసవీ కాంప్లెక్స్ , ఆర్టీసీ డిపో, చిన్న బస్టాండ్ ఆటో స్టాండ్, విశ్వనాథపురంలో బజార్ ముఠా, రిక్షా యూనియన్ వద్ద ఏర్పాటు చేసిన సిఐటియు జెండాలను సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి శ్రీనివాసరావు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులకు శానిటైజర్లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి ఎం రమేష్, నగర పంచాయితీ శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు, ఎన్ఫోర్స్మెంట్ డిటి రామనారాయణ రెడ్డి, మండల సిఐటియు నాయకులు జి నాగులు ,డి సుబ్బయ్య ,కె శేషయ్య ,కె.ప్రసాద్ ,యం సురేష్ ,సిహెచ్ల క్ష్మీనలసింహం ,చెన్నయ్య ,కె.రాజు ,జి శ్రీను  తదితరులు పాల్గొన్నారు