శాసనసభ్యులు కుందూరును కలిసిన సుబ్బనాచారి

మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డిని మార్కాపురంలోని ఆయన నివాస గృహంలో బాలినేని యువసేన జిల్లా అధ్యక్షులు దొడ్డేపల్లి సుబ్బనాచారి ఆదివారంనాడు కలిశారు.

కుందూరును కలిసిన సుబ్బానాచారి పలు విషయాలను గురించి చర్చించిన అనంతరం….. గత పది సంవత్సరాలుగా పార్టీలో బాలినేని యువసేన అధ్యక్షుడిగా పనిచేస్తూ పార్టీ కార్యకలాపాలు మరియు అన్ని కార్యక్రమాల నిర్వహణలో నావంతు పాత్ర పోషిస్తున్నానని…… ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తనకు నామినేటెడ్ పదవులలో స్థానం కల్పించాలని కోరినట్లు సమాచారం.

శాసనసభ్యులు కుందూరును కలిసిన వారిలో సుబ్బనాచారితో పాటుగా తాతిరెడ్డి చిన్న వెంకటేశ్వరరెడ్డి, జెక్కిరెడ్డి కృష్ణారెడ్డి, కోవెలకుంట్ల వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.