కోవెలకుంట్లను పరామర్శించిన శాసనసభ్యులు కుందూరు

మాజీ మండల పరిషత్ అధ్యక్షులు కోవెలకుంట్ల నరసింహారావును శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి పరామర్శించారు.

కోవెలకుంట్ల నరసింహారావు తనయుడు మూర్తి (23) అనారోగ్యంతో శనివారంనాడు మృతి చెందగా…… ఆదివారంనాడు శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి, మాజీ శాసనసభ్యులు జెంకె వెంకటరెడ్డి మరియు వైసీపీ నాయకులు జి శ్రీనివాసులు, కల్లం సుబ్బారెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, పులగొర్ల శ్రీనివాస్ యాదవ్, తదితరులు మూర్తి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

అనంతరం కోవెలకుంట్ల నరసింహారావుకు అలాగే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.