ఎంపి, ఎంఎల్ఏలను సత్కరించిన ఫోటో గ్రాఫర్స్ అసోసియేషన్

ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనువాసులరెడ్డి, మార్కాపురం శాసనసభ్యలు కుందూరు నాగార్జునరెడ్డిలను ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు.

వివరాల్లోకి వెళితే సోమవారంనాడు స్థానిక పిచ్చిరెడ్డి నివాసానికి ఎంపీ మరియు ఎమ్మెల్యే వచ్చిన సందర్భంగా పొదిలి మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనువాసులరెడ్డి, మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డిలను సత్కరించారు. ఈ సందర్భంగా ఫోటో గ్రాఫర్స్ అసోసియేషన్ వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని వారు
హామీ ఇచ్చారు. అనంతరం ఇరువురిని వైసీపీ యువజన నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.