తహశీల్దార్ విజయారెడ్డి హత్యను నిరసిస్తూ నల్లబ్యాడ్జీలతో నిరసన

తహశీల్దార్ విజయారెడ్డి హత్యకు నల్లబ్యాడ్జీలతో రెవిన్యూ సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డిజిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల రెవిన్యూ తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ విజయారెడ్డిపై పెట్రోలుపోసి నిప్పంటించి హత్యచేసిన సంఘటనకు నిరసనగా పొదిలి మండల రెవిన్యూ తహశీల్దార్ కార్యాలయంలో రెవిన్యూ సిబ్బంది నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.