మున్సిపల్ అభివృద్ధి, జగనన్న టౌన్ షిప్,కోవిడ్ పై సమీక్ష

మున్సిపల్ పరిపాలన భవనం నిర్మాణం, పార్క్ లు ఏర్పాటు మొదలైన వాటికి స్ధల సేకరణ మరియు జగనన్న టౌన్ షిప్ కు పట్టణం నుంచి 5 కిలోమీటర్ల లోపల స్ధల సేకరణ , కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ, పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు పై మండల రెవెన్యూ తహశీల్దారు హనుమంతరావు అధ్యక్షతనతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పొదిలి నగర పంచాయితీ కమీషనర్ భవాని ప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు, సర్వేయర్ బ్రహ్మం మరియు నగర పంచాయితీ పరిధిలోని గ్రామ రెవెన్యూ అధికారులు, నగర పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు