సర్టిఫికెట్లు పంపిణీ చేసిన నాబార్డు ఎంజిఎం వెంకట రమణ

నాబార్డు ద్వారా శిక్షణ పొందిన నిరుద్యోగు యువతి యువకులకు సర్టిఫికెట్లను ఎంజిఎం వెంకట రమణ పంపిణీ చేశారు.

వివరాల్లోకి వెళితే పొదిలి పట్టణంలోని స్థానిక మాతృ కోచింగ్ సెంటర్ నందు షార్ప్ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నాబార్డు సౌజన్యంతో ఉచిత వెబ్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం నాడు శిక్షణ పూర్తిచేసుకున్న వారికి సర్టిఫికేట్లు ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో షార్ప్ స్వచ్చంద సేవా సంస్థ ప్రతినిధి రవిచంద్ర, మాతృ కోచింగ్ సెంటర్ అధినేత షేక్ కెల్లంపల్లి నజీర్, శిక్షకులు శైలజా తదితరులు పాల్గొన్నారు