నగర పంచాయితీ తుది ఓటర్ల జాబితా విడుదల

పొదిలి నగర పంచాయితీ తుది ఓటర్ల జాబితాను నగర పంచాయితీ కమీషనర్ భవాని ప్రసాద్ విడుదల చేశారు.

వివరాల్లోకి వెళితే సోమవారం నాడు స్థానిక నగర పంచాయతీ కార్యాలయం నందు కమీషనర్ భవాని ప్రసాద్ నగర పంచాయితీ తుది ఓటర్ల జాబితాను ‌విడుదల చేసారు.

ఈ సందర్భంగా కమీషనర్ భవాని ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ వారి ఉత్తర్వులు మేరకు వార్డుల నందు యస్సీ యస్టీ బిసి మహిళ‌ రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు వార్డులలో యస్సీ యస్టీ బిసి మహిళ‌ ఓటర్లను గుర్తించి సంబంధించిన ముసాయిదా జాబితాను
9వ తేదీ విడుదల చేసి అభ్యంతరాలు కోరకు సంబంధించిన ఓటర్ల జాబితాను స్థానిక నగర పంచాయితీ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం, మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం ల్లో ఏర్పాటు చేయటమైనది అభ్యంతరాల గడువు లోపల ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో పురపాలక శాఖ ఆంధ్రప్రదేశ్ వారి ఉత్తర్వులు మేరకు తుది ఓటర్ల జాబితాను ‌ ప్రచురించటం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పొదిలి నగర పంచాయితీ శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు, అసిస్టెంట్ ఇంజనీర్ రవీంద్రుడు, తదితరులు పాల్గొన్నారు