పొదిలి లో జాతీయ పోషణ మాసం మహోత్సవం ర్యాలీ

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

7వ జాతీయ పోషణ మాసం మహోత్సవం ముగింపు సందర్భంగా స్థానిక పొదిలి ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో స్థానిక ఎంపిడిఓ కార్యాలయం ప్రాంగణం నుంచి విశ్వనాథపురం, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా పెద్ద బస్టాండు వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు.

అనంతరం స్థానిక బాలికల ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేసిన పౌష్టికాహారం స్టాల్ లో వివిధ రకాల పిండి వంటల రుచులను విద్యార్థులు పంచి పెట్టారు.

విద్యార్థులు నుంచి సంతకాలు సేకరించారు.

ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిణి సుధా మారుతి, చైల్డ్ ఫండ్ లింక్ వర్కర్ సురేష్, ఐసిడిఎస్ ప్రాజెక్టు సూపర్వైజర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు