నవరత్నాల అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించిన మార్కాపురం నియోజకవర్గ నవరత్నాల అమలు ప్రత్యేకాధికారి….

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నవరత్నాల అమలులో భాగంగా పొదిలి మండల పరిషత్ కార్యాలయం నందు మార్కాపురం నియోజకవర్గంలోని పొదిలి, కొనకనమిట్ల, తర్లుపాడు, మార్కాపురం మండలాల అధికారులతో మార్కాపురం నియోజకవర్గ నవరత్నాల అమలు ప్రత్యేకాధికారి (జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్) వెంకటేశ్వర్లు సమీక్షా సమావేశం నిర్వహించారు.

మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అధికారులతో ఆయన మాట్లాడుతూ వర్షాభావ కారణంగా ప్రతి మండలంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేకదృష్టి పెట్టి ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని….. అలాగే వర్షాకాలంలోని నీటిని వృధాగా పోకుండా చర్యలు తీసుకోవాలని…. రైతులకు సకాలంలో పంటలపై అవగాహన కల్పిస్తూ సలహాలు సూచనలు ఇవ్వాలని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమంలో ప్రజలు సమస్యలను త్వరిత పరిష్కారం అందేలా చూడాలని ఆయన సూచించారు.