ఘనంగా యన్టీఆర్ 98వ జయంతి వేడుకలు

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

వివరాల్లోకి వెళితే శుక్రవారం నాడు తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 98వ జయంతి పురస్కరించుకుని స్థానిక పొదిలి పెద్ద బస్టాండ్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో పొదిలి మండల, పట్టణ పరిధిలోని తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్, తెలుగు దేశం పార్టీ మైనారిటీ విభాగం ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు షేక్ రసూల్, టి యన్ యస్ యఫ్ పార్లమెంట్ కమిటీ కార్యదర్శి షేక్ గౌస్ బాషా, పార్లమెంట్ కమిటీ బిసి నాయకులు పోల్లా నరసింహా యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ముల్లా ఖూద్దుస్, మండల పార్టీ నాయకులు ఆవులూరి యలమంద, కాటూరి వెంకట నారాయణ బాబు, సయ్యద్ ఇమాంసా, ఎండీ గౌస్, కాటూరి వెంకటేశ్వర్లు, ముని శ్రీనివాస్, కాటూరి జగదీష్ నారాయణ్ , యర్రమూడి వెంకట్రావు యాదవ్, కాటూరి శ్రీను, జ్యోతి మల్లి తదితరులు పాల్గొన్నారు