ఒంగోలు పార్లమెంటులో నాలుగు శాసనసభ స్థానాలు కైవసం చేసుకోవాలి: నూకసాని

ఒంగోలు పార్లమెంటులో నాలుగు శాసనసభ స్థానాలు కైవసం చేసుకునేదిశగా మనం ముందుకు వెళ్ళాలని ఆంధ్రప్రదేశ్ యాదవ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మరియు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు.


వివరాల్లోకి వెళితే స్థానిక దర్శి రోడ్డులోని గోశాల నందు అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో జరిగిన యాదవ కార్తీక వనమహోత్సవ కార్యక్రమానికి హాజరైన నూకసాని బాలాజీ మాట్లాడుతూ జిల్లాలో కనిగిరి నియోజకవర్గం నుండి మధుసూదన్ యాదవ్ గెలుపొందడం స్ఫూర్తిగా తీసుకుని జిల్లాలోని
ఒంగోలు పార్లమెంటులో మరో మూడు శాసనసభ స్థానాలు కైవసం చేసుకునే విధంగా యాదవ మహాసభ పనిచేయాలని అన్నారు.