ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించిన నిర్మలా కాన్వెంట్ విద్యార్థులు

పుల్వామా దాడి నేపథ్యంలో స్థానిక విశ్వనాధపురంలోని నిర్మలా కాన్వెంట్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాఠశాల నుండి స్థానిక విశ్వనాధపురం సెంటర్ మీదుగా పెద్ద బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం పెద్ద బస్టాండ్ సెంటర్ నందు మానవహారం నిర్మించారు.

జై భారత్ …..పాకిస్థాన్ డౌన్ డౌన్….. జై జవాన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంతటి క్రూరమైన చర్యకు పాల్పడిన ఉగ్రవాదులను మట్టుబెట్టి పాక్ కు సరైన గుణపాఠం చెప్పాలని అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమవీరుల ఆత్మకు శాంతి కలగాలని……. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని…… వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.