మొక్కలు నాటిన జనసేనికులు

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన పార్టి ఆధ్వర్యంలో శుక్రవారం నాడు స్థానిక మర్రిపుడి రోడ్డు నందు మొక్కలు నాటి మానవాళికి మనుగడ వస్తున్న ముప్పును అదిగిమించుటకు ప్రతి ఒక్క పౌరుడు కృషి చేయ్యాలని జనసైనికులు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరియు నియోజకవర్గ ఇన్చార్జి ఇమ్మడి కాశీనాథ్ పిలుపు మేరకు మొక్కలు నాటి జనసైనికులు బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ ఉద్యమం లో పాలుపంచుకోవడం జరిగింది అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేరుస్వాముల శ్రీనివాస్, షేక్ కాలేషా, హల్చల్ జహీర్, షేక్ ఖాజా, నాగార్జున యాదవ్, మోసిన్ , పండు తదితరులు పాల్గొన్నారు