కోవిడ్ ఆంక్షలు ‌నేపథ్యంలో యస్ఐ సురేష్ ఉక్కుపాదం…. కేసులు నమోదు

కోవిడ్ ఆంక్షలు ‌నేపధ్యంలో పొదిలి యస్ఐ సురేష్ ఉక్కుపాదం మోపి కేసులు నమోదు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలు నేపథ్యంలో బుధవారంనాడు స్థానిక పొదిలి పోలీసు స్టేషన్ వద్ద కోవిడ్ ఆంక్షల ‌సమయం మధ్యాహ్నం 12గంటల తర్వాత ‌రోడ్డు మీద ప్రభుత్వ ‌అనుమతులు లేకుండా ప్రయాణం చేస్తున్న వాహనదారుల వాహనాలపై ‌ కేసులు నమోదు చేశారు.

ఈ కార్యక్రమంలో పొదిలి పోలీసు స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.