పొట్టి శ్రీరాములకు ఘనంగా నివాళులర్పించిన వాసవి క్లబ్ మరియు వైసీపీ నాయకులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములకు ఘనంగా నివాళ్ళర్పించారు.

వివరాల్లోకి వెళితే శుక్రవారంనాడు స్ధానిక పంచాయతీ కార్యాలయం వద్దగల అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి వాసవి క్లబ్స్ పొదిలి మరియు మండల వైసీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగం చేసిన మహోన్నత వ్యక్తి పొట్టిశ్రీరాములు అని…. ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన పొట్టిశ్రీరాములును ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఆయన త్యాగాలను కొనియాడరు.

ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కల్లం వెంకట సుబ్బారెడ్డి, జి శ్రీనివాసులు, గొలమారి చెన్నారెడ్డి, సత్యం, షేక్ మహుబుబ్ బాషా, తదితరులు పాల్గొన్నారు.