వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ

దేశవ్యాప్తంగా రెండు రోజుల సమ్మెలో భాగంగా సోమవారం నాడు పొదిలి పట్టణం నందు వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

స్థానిక పొదిలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నుంచి మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు,ఆటో డ్రైవర్లు, వివిధ రంగాలకు చెందిన కార్మికులు తదితరులు సమ్మె లో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి యం రమేష్,సిపిఐ కార్యదర్శి కె వి రత్నం అంగన్వాడీ యూనియన్ నాయకురాలు శోభా వివిధ కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు