పల్లె వెలుగు బస్సును ప్రారంభించిన రీజనల్ మేనేజర్
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి ఆర్టీసీ డిపో నందు నూతన పల్లె వెలుగు బస్సును రీజనల్ మేనేజర్ సుధాకర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు.
వివరాల్లోకి వెళితే సోమవారం నాడు స్థానిక ఆర్టీసీ డిపో నందు పొదిలి-వినుకొండ నూతన సర్వీస్ ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రీజనల్ మేనేజర్ సుధాకర్ బాబు పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ సుందరరావు మరియు ఆర్టీసీ డిపో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు