సాయిబాబా దేవాలయంలో లిఫ్ట్ ఏర్పాటు

స్థానిక రధంరోడ్డులోని సాయిబాబా దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం దాతల సహకారంతో లిఫ్ట్ ను ఏర్పాటు చేశారు.

తొలుత లిఫ్ట్ నిర్మాణ దాతలు అయిన యాదాల వెంకటేశ్వర్లు, యాదాల సుబ్బారావు మరియు వారి కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ సభ్యులు ఊరేగింపుగా స్వాగతం పలికి ఆలయం ఆలయ ప్రాంగణంలో శాలువాతో సత్కరించారు.

అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి దాతలు లిఫ్టుని ప్రారంభించిన అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కలువా సత్యనారాయణ, కార్యదర్శి సోమిశెట్టి చిరంజీవి, మరియు కమిటి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.