తక్కువ ధరకే ఇంటి స్థలాలు అమ్మకాలు : కమీషనర్ భవాని ప్రసాద్

                                     ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పురపాలక సంఘం / నగర పంచాయితీ ల యందు ఆర్థికంగా వెనుకబడిన మధ్యతరగతి వారికి 200 నుంచి 240 చదరపు గజాల స్థలాల్లో అత్యాధునిక హంగులతో లే ఔట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం జిఓ నెంబర్ 130 తేదీ 23.03.2021 జారీ చేసిందని సదరు ఆదేశాల మేరకు పొదిలి నగర పంచాయితీ పరిధిలో 200 లేక 240 చదరపు గజాల స్థలాల్లో అన్ని అనుమతులతో ప్రభుత్వ ధరకే లాభాపేక్ష లేకుండా అమ్మకాలు జరుపుతున్నట్లు పొదిలి నగర పంచాయితీ కమీషనర్ భవాని ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు.

కావున ఆసక్తి ఉన్న వారు ఇంటి ఇంటికి సర్వే వచ్చే సమయంలో తమ యొక్క పూర్తి వివరాలు తెలియజేయగలరని తెలిపారు