ఇంటి నివేశన స్థలాల పరిశీలన మౌళిక వసతుల కల్పించాలని కలెక్టర్ ఆదేశాలు

పొదిలి గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 1177తోపు పోరంబోకులో ఇంటి నివేశన స్థలాల కోసం వేసిన లే ఔటును జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ పరిశీలించారు.


వివరాల్లోకి వెళితే గురువారంనాడు స్థానిక తోపులోని ఇంటి నివేశన స్థలాల లే ఔట్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ ఇంటి నివేశన స్థలాల జాబితాలో పేరు లేని అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చునని….. అదేవిధంగా ఇంటి నివేశన స్థలాల పంపిణీ నాటికి ఇంటి నిర్మాణం చేసి ఉండేవిధంగా విద్యుత్ సరఫరా మంచినీటి సరఫరా మొదలగు మౌళిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కందుకూరు రెవెన్యూ డివిజన్ అధికారి ఓబులేసు, మండల రెవెన్యూ తహశీల్దారు ప్రభాకరరావు, వైకాపా నాయకులు జి శ్రీనివాసులు, కల్లం వెంకట సుబ్బారెడ్డి, గుజ్జుల రమణారెడ్డి మరియు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.