పెట్రోల్ ధరలపై ప్రధాని ప్రకటన దేశప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉంది – సిపియం

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

ప్రధాని పెట్రో ప్రకటన పై ముఖ్యమంత్రి జగన్ స్పందించాలి

-రాష్ట్రంలో మహిళలకు రక్షణ కొరవడింది.. తుమ్మపూడి ఘటన దారుణం

దేశంలో పెట్రోల్ విషయంలో ప్రధానమంతి మోడీ ప్రకటన ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఉన్నారు.
గురువారం నాడు పొదిలి ల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  విజయవాడ సంఘటన మరువకముందే తెనాలిలో అత్యచార ఘటన చోటు చేసుకుందని ప్రభుత్వం తక్షణమే స్పందించి అత్యాచార కుటుంభానికి 25 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దిశ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని ఆయన కొరారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గం సభ్యులు వై వెంకటేశ్వర్లు, రాష్ట్ర కంట్రోల్ కమిటీ చైర్మన్ జాలా అంజయ్య, పశ్చిమ ప్రకాశం జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీఫ్, ప్రాంతీయ కార్యదర్శి యం రమేష్ తదితరులు పాల్గొన్నారు