ఆటోవర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం

ఆటో వర్కర్స్ యూనియన్ పొదిలి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే వాహన మిత్ర పథకం క్రింద రెండవ విడతగా 10వేల రూపాయలు ఆటో కార్మికుల ఖాతాలో జమ చేయడాన్ని హర్షిస్తూ పొదిలి ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక పెద్ద బస్టాండులోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద జగన్ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు షేక్ గౌస్ మోహిద్దీన్ మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ఆ నాటి పాదయాత్ర సమయంలో ఆటో వర్కర్ల సమస్యలు గమనించి వాహన ఖర్చుల నిమిత్తం ప్రతి సంవత్సరం వాహనమిత్ర పథకం క్రింద ఇస్తానని చెప్పిన 10వేల రూపాయలు మొదటి విడత 10వేల రూపాయలను అందజేసి సంవత్సరం పూర్తి కాకుండానే లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 4నెలల ముందుగానే ఖాతాలో జమచేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో వర్కర్స్  యూనియన్ అధ్యక్షులు షేక్ జిలానీ వైసిపి నాయకులు సానికొమ్ము శ్రీనివాసులరెడ్డి, జి శ్రీనివాసులు, కల్లం వెంకట సుబ్బారెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, ఆటో యూనియన్ నాయకులు మరియు సభ్యులు తదితరులు పాల్గొన్నారు