కుందూరు ఆధ్వర్యంలో వాలంటీర్లు కు సన్మానం

మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ వార్డు వాలంటీర్లు ఘనంగా సన్మానించారు.

వివరాల్లోకి వెళితే స్థానిక దరిశి రోడ్ లోని మంజునాథ కళ్యాణ్ మండపంలో నగర పంచాయితీ కమీషనర్ డానియల్ జోసప్ అధ్యక్షతనతో జరిగిన గ్రామ వార్డు వాలంటీర్ల సేవ పురస్కారం ప్రదానోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ సమయంలో వాలంటీర్లు చేసిన సేవాలు మరువలేనివి అని కొనియాడారు.

అనంతరం ఉత్తమ ప్రతిభ చూపిన వార్డు గ్రామ వాలంటీర్లు కు సేవా మిత్రా, సేవారత్న, సేవా వజ్రా పురస్కారాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో పొదిలి సిఐ సుధాకరరావు, తహశీల్దారు దేవ ప్రసాద్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ, వ్యవసాయ అధికారి దేవిరెడ్డి శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.