తల్లిని వేధిస్తున్నాడని పినతండ్రిని కడతేర్చిన కుమారుడు

ప్రకాశంజిల్లా పొదిలి లో దారుణ సంఘటన నెలకొంది.. తన తల్లిని వేదిస్తున్నడని వరుసకు పినతండ్రి అయిన ఖాదర్ ను సిమెంట్ బ్రిక్ తో దారుణంగా‌ మోది చంపి …. అనంతరం పొలీసులకు‌ స్వయంగా లొంగిపొయిన సంఘటన సంచలనం కలిగించింది

వివరాల్లోకి వెళితే ప్రకాశంజిల్లా పొదిలిలోని పొదిలిమ్మ నగర్ లో నివాసం ఉంటున్న హుసేబి తన భర్త చనిపొవడంతో నల్గొండజిల్లా నకరికల్ ప్రాంతానికి చెందిన ఖాదర్ తో సహజీవనం చేస్తుంది. ఖాదర్ కలాయి పనిచేసుకుంటు వృత్తి రిత్యా పలుగ్రామాలు తిరుగుతు పాడై పొయినా బిందెలకు మాట్లు వేస్తు జీవనం కొనసాగిస్తున్నాడు. హుసేన్ బి పరిచయంతో పొదిలి చుట్టుప్రక్కల పనిచేస్తున్నాడు.

హుసేబికి మొదటిభర్తకు కలిగిన ఒక కుమారుడు ఉన్నాడు. ఇతను పట్టణంలోని కులిపనులు చేసుకుంటు తల్లితొ కలిసి ఉన్నాడు.

ఖాదర్ మద్యం తాగి తల్లిని వేదిస్తుండటంతో భరించలేని మీరావళి వరుసకు పినతండ్రి గా ఉన్న ఖాదర్ సిమెంట్ బ్రిక్ తో మెదిచంపి శవాన్ని ఒక గొనసంచెలో కట్టి పొలీస్ స్టేషన్ కు వెళ్ళి లోంగిపొయ్యాడు.. సంఘటన స్థలానికి చేరుకున్న పొదిలి సిఐ సుధాకర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు