వైశ్యలు అన్ని రంగల్లో అభివృద్ధి చెందాలి: శిద్దా

ఆర్య వైశ్యలు అన్ని రంగలలో అభివృద్ధి చెందాలని మాజీ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. వివరాలు లోకి వెళితే ఆదివారం నాడు స్థానిక మార్కపురం రహాదారి లోని ఒక పాఠశాల నందు వాసవి 9 మరియు 19 అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఆర్య వైశ్య కార్తీక వన మహోత్సవం వేడుకలల్లో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వాసవి సత్రలు మరియు వారి సేవలు ఉపయోగంగా ఉన్నాయిని అదేవిధంగా పేద వైశ్యలను అదుకోవటం తోపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి భవన్ అధ్యక్షులు సన్నిశెట్టి రాధాకృష్ణ మూర్తి మాజీ శాసనసభ్యులు సానికొమ్ము పిచ్చిరెడ్డి వాసవి సత్ర సముదాయాల అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లు జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు గునిపూడి భాస్కర్ మాజీ ఎంపిటిసి మాధవిలత కుప్పం ప్రసాద్,శ్రీమతి ప్రసన్న, వాసవి 9 ప్లస్,వాసవి 19 ప్లస్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు