వరలక్ష్మీవ్రత శుక్రవారం సందర్భంగా కిక్కిరిసిన దేవాలయాలు….

శ్రావణమాస వరలక్ష్మీవ్రత శుక్రవారం సందర్భంగా పట్టణంలోని అమ్మవారి దేవాలయాలు కిక్కిరిసిపోయాయి.

వివరాల్లోకి వెళితే శ్రావణమాస వరలక్ష్మీవ్రత శుక్రవారం సందర్భంగా పట్టణంలోని పొదిలమ్మ, మహాలక్ష్మి, వాసవి కన్యకాపరమేశ్వరి, పార్వతీమాతా, అంకాల పరమేశ్వరి దేవి, మొదలగు అమ్మవారి దేవస్థానాలకు వేలాదిగా భక్తులు బారులు తీరి మొక్కులు తీర్చుకున్నారు.